తాల్ముద్-జూడాయిజం
తాల్ముద్ అన్నది యూదుమతబోధకులైన రబ్బీలు పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడిచ్చిన తనాక్ (పాతనిబంధన గ్రంథము) కు వేరుగా వ్రాసుకున్న యూదు మరియు అన్యసాంప్రదాయాలతో కూడిన అనేక గ్రంథాలలో ప్రధానమైనది.
“తాల్మూద్-జూడాయిజం” అన్న మతవిశ్వాసం ప్రధానంగా యూదుమతబోధకులైన రబ్బీల బోధలపై అంటే తాల్ముద్ బోధలపై ఆధారపడినది. కనుక దీన్ని “రబ్బీలజూడాయిజం” (Rabbinic Judaism) అనికూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జూడాయిజం (Judaism) అనేక శాఖోపశాఖలుగా విడిపోయింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తాల్ముద్-జూడాయిజం లేక రబ్బీలజూడాయిజం అన్నది 175 శాఖలుగా విడిపోయినట్లుగా కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 70 క్రీ.శ.లో యెరూషలేములోని దేవాలయము అంతముకావటముతో జూడాయిజపు పురోగతికి రెండు తక్షణ ప్రమాదాలను పసికట్టారు రబ్బీలుగా పిలువబడే ఆనాటి యూదుమతబోధకులు. ఒకవైపు యెరూషలేములోని దేవాలయపు నాశనము తనాక్-జూడాయిజపు విధులకు ఆచారాలకు తెరదించితే మరొకవైపు తనాక్-జూడాయిజములోని భక్తిపరులైన వేలాదిమంది యూదులు క్రమక్రమంగా క్రైస్తవ మార్గములోకి మళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జూడాయిజం అన్నదే వుండదిక. అదే జరిగితే యిక రబ్బీల పాత్రవుండదు వారి ప్రాధాన్యతా వుండదు.
క్రీస్తు శకము రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే రబ్బీలజూడాయిజం (తాల్ముదు-జూడాయిజం) మొలకెత్తి ఐదవ శతాబ్ధముకల్లా వేళ్ళుతన్ని వటవృక్షంగా మారిపోయింది. ఈ ఎదుగుదలలో తాల్ముద్-జూడాయిజం తనాక్-జూడాయిజం నుండి పూర్తిగా వేరై బబులోను లోని ఆచారాలు బోధల ప్రాతిపదికన స్థిరపడి పైకి మాత్రం తనాక్ (పాతనిబంధన గ్రంథం) వేశం ధరించి అంతర్గతంగా తనాక్ యొక్క బోధలకు వ్యతిరేకమైన బోధలను ఆచారాలను ప్రవేశపెడుతూ విస్తరించడం ప్రారంభించింది. నిజానికి ఈరకమైన పోకడలో మొదటి శతాబ్ధములో ప్రారంభమైన నిజక్రైస్తవ్యంనుండి దూరంగా వెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా పెరిగి విస్తరించిన మతక్రైస్తవ్యానికి మరియు రబ్బీలజూడాయిజానికి దగ్గర పోలికలున్నయనే చెప్పవచ్చు. ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవలసిన వాస్తవం బైబిల్-క్రైస్తవ్యం లేక నిజక్రైస్తవ్యంలోని విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నా వారి సంఖ్య మాత్రం స్వల్పమైనదే. ఈ సత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలోనే వెల్లడిచేయబడింది:
“ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి.7:13-14)
“…అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” (లూకా.18:8)
తాల్ముద్ అన్న పదానికి అధ్యయనం (study) అని అర్థం. తాల్ముద్-జుడాయిజంలో రెండురకాల తాల్ముదు సాహిత్యము వాడుకలోవున్నాయి. ఒకటి, ‘యెరూషలేము తాల్ముద్.’ ఇది 2వ శతాబ్ధము క్రీ.శ. – 3వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో పాలస్తీనాలోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. రెండు, ‘బబులోను తాల్ముద్.’ ఇది 3వ శతాబ్ధము క్రీ.శ. – 4వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో బబులోనులోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. కొంతవరకు రెండింటిలోని మూలపాఠాలు ఒకదానితో మరొకటి పోలివున్నా రెండింటిలోని వివరాలు సమాచారాలమధ్య వ్యత్యాసాలుకూడా వున్నాయి. రెండింటిలో బబులోను తాల్ముద్ పెద్దది మరియు క్రొత్తది. కనుక రబ్బీలజూడాయిజంలో బబులోను తాల్ముద్నే ప్రామాణికంగా లేక్కిస్తారు. తాల్ముద్ లో రెండు భాగాలుంటాయి—‘మిష్నా’ (Mishna) మరియు ‘గమారా’ (G’mara).
‘మిష్న’ అన్నది రబ్బీలచేత సంకలనము (compiled) మరియు సంపాదకత్వము (edited) చేయబడిన మౌఖికతోరా (Oral Torah) యొక్క గ్రంథస్థరూపముకాగా, ‘గమరా’ అన్నది మౌఖికతోరా (Oral Torah) యొక్క రబ్బీల వ్యాఖ్యానభాగము (commentary). మొత్తానికి తాల్ముదులోని ఈ రెండు భాగాలుకూడా యూదు మత పెద్దలైన రబ్బీల సృష్టి అన్నది గుర్తుంచుకోవలసిన విశయం!
జూడాయిజం లోని అన్ని శాఖలు తాల్ముద్ సాహిత్యానికి ఒకేవిధమైన ప్రాధాన్యత నివ్వవు అన్నది గమనార్హమైన విశయం. కొన్ని జూడాయిజం శాఖలు తాల్ముద్ గ్రంథాలను రబ్బీల సృష్టిగా గుర్తించి వాటిని తృణీకరిస్తున్నాయి. కారైటు జూడాయిజం, మధ్యయుగం లోని జూడాయిజం మార్మిక శాఖలు, రిఫామ్డ్ జూడాయిజం వారు, ఆధునిక యూదులు మొదలైన జుడాయిజం శాఖలు తాల్మూద్ గ్రంథాలను తిరస్కరిస్తారు.
క్రీస్తు శకము 1వ శతాబ్ధపు మొదటి అర్థభాగములోనే తనాక్-జూడాయిజం (బైబిలు జూడాయిజం) కు తెరపడటముతో రబ్బీలు బెంబేలెత్తిపోయారు. యూదుజాతిని యూదుమతాన్ని సమ్రక్షించే తన బృహత్తర ప్రణాళికలో భాగంగా రబ్బి అకివ రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే యూదుమతకొనసాగింపుకు అసలు దేవాలయముతోనే పనిలేకుండా నిరాటంకంగా కొనసాగగలిగే క్రొత్త జూడాయిజపు స్థాపనకై వేరొక తోరా (ఉపదేశము/ధర్మశాస్త్రము) ఆవిశ్కరణకు పూనుకొని మోషేతోపాటు యితర పాతనిబంధన ప్రవక్తలు ఎవరూ కని విని యెరుగని ‘మౌఖిక తోరా’ అన్న భావనకు (concept) రూపకల్పన చేసి దానికి యూదులమధ్య చెల్లుబాటును సంపాదించగలిగాడు. 200 క్రీ.శ. ప్రాంతములో ‘రాజకుమారుడు యూదా’ (Judah the Prince/యెహుదా హనసి: 135 క్రీ.శ.- 217 క్రీ.శ.) అనే రబ్బి మౌఖికతోరాగా చెల్లుబాటుసంపాదించిన యూదుబోధలను (Jewish teachings), పురాణాలను (legends), పిత్రుపారంపార్యాచారాలను (tranditions), ప్రాచిన జ్ఙానబోధలను (ancient wisdom), కొంత యూదుచరిత్రను (Jewish history) సేకరించి వాటన్నిటిని రంగరించి తన సంపాదకత్వముతో క్రొత్త జూడాయిజపు వుద్దరణకు తగిన మతబోధలు, ఆచారాలు, విధులతో కూడిన గ్రంథాన్ని సిద్దపరచి రాబోవుతరాలకు వుపయుక్తంగా వుండేందుకు గ్రంథరూపములో భద్రపరిచాడు. అదే ‘మిష్నా’గా పేరుస్థిరపరచుకొని వాడుకలోకి వచ్చింది.
రబ్బీలు అనబడే యూదా మతబోధకుల కథనం ప్రకారం సీనాయి కొండపై దేవుడు మోషేకు రెండు తోరాలను (ధర్మశాస్త్రాలను) యిచ్చాడట! అందులో ఒకటి వ్రాతపూర్వకంగా యివ్వబడిన తోరా (Written Torah) మరొకటి మౌఖికతోరా లేక నోటిమాటతో యివ్వబడిన మొదటి తోరా యొక్క వివరణ (Oral Torah). అయితే, బైబిలులో మాత్రం యిందుకు సంబంధించి ఎలాంటి ఆజ్ఙకాని, వివరణగాని, లేక సూచనగాని యివ్వబడలేదు. మోషేద్వారా వ్రాతపూర్వకంగా యిచ్చిన తోరా విశయములో దేవుడు అనేక పర్యాయాలు బైబిలులో సూచించాడు. కాని, మౌఖిక తోరాగా పిలువబడుతున్న రెండవ తోరానుద్దేశించి ఒక్కమాటకూడా మోషేగాని లేక ప్రవక్తలుగాని యేమాటా చెప్పలేదు. ఈ రెండవ తోరా/మౌఖిక తోరా అన్నది యూదుల పితృపారంపార్యాచారాల (traditions of men) ఆధారంగా వునికిలోకి వచ్చి రబ్బీల చేతిలో ప్రామాణికత్వాన్ని మరియు గ్రంథరూపాన్ని సంతరించుకొన్న రబ్బీల స్వసృష్టి అన్నది చెప్పకనే తెలుస్తోంది.
కేవలం యూదుల పిత్రుపారంపార్యాచారాలేకాక పుక్కిటిపురాణాలు (legends) ప్రాచీనుల జ్ఙానసముర్పార్జనలతోపాటు మోషేధర్మశాస్త్రములో వ్రాయబడని ఆచారవివరాలు సహితం రబ్బీల చొరవతో వునికిని సంతరించుకొని మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవ ధర్మశాస్త్రము) రూపములో విరాజిళ్ళుతున్నాయి. ఈకారణంగా తాల్ముదు బోధలు చాలావరకు దైవప్రేరణతో లిఖితరూపములో అందించబడిన మోషేధర్మశాస్త్రముయొక్క బోధలకు వేరుగా మరియు వ్యతిరిక్తంగా వుండటం కద్దు. ఈ వాస్తవాన్ని గ్రహించిన అనేకమంది ఆధునిక యూదుజాతీయులు మతవిశ్వాసాలనే పరిత్యజించి నాస్తికులుగా మారిపోయారు. ప్రపంచములోని మతాలన్నిటిలో నిమ్నమతాసక్తిగలవారు యూదులు. ఈ నేపథ్యములో ప్రపంచవ్యాప్తంగా వున్న యూదులలో కేవళం 38% మాత్రమే మతవిశ్వాసాలకు విలువనిచ్చేవారన్నది గమనార్హం (HAARETZ, New Poll Shows Atheism on Rise, with Jews Found to Be Least Religious. Website: https://www.haaretz.com/jewish/jews-least-observant-int-l-poll-finds-1.5287579. Accessed date: 17-12-2018).
ఈనాటి జూడాయిజములో (రబ్బీలజూడాయిజములో) సత్యముందని బ్రమించి అందులోకి మతమార్పిడిపొందిన వారిని విస్మయపరచే ఒక వాస్తవమేమిటంటే ఈనాటి రబ్బీలజూడాయిజంకు (తాల్ముద్-జూడాయిజం) మూలపురుషునిగా వుండి దానికి రూపకల్పన చేసినది యూదుడుకాదుగాని ఒక అన్యుడు. అది రబ్బీ అకివ (50 క్రీ.శ.-135 క్రీ.శ.). సిసెరా అనబడిన ఒక దుష్టుడైన అన్యుని వంశములోనుండి వచ్చి జూడాయిజములోకి మతమార్పిడి పొందినవాడు రబ్బీ అకివ (Jewishhistory.org. Rabbi Akiva. Website: https://www.jewishhistory.org/rabbi-akiva-2/, date of access: 18-12-2018). గమనించాలి, అన్యులెవరైనా జూడాయిజములోకి మతమార్పిడిపొందితే అలాంటివారికి ఇశ్రాయేలీయులనిగాని లేక యూదులనిగాని దేవుడు పేర్కొన్నట్లు తనాక్ అంతటిలో ఎక్కడా ఆధారాలు లేవు. దైవలేఖనాలైన తనాక్ (పాతనిబంధనగ్రంథము) బోధప్రకారము అలాంటి అన్యులు నిజదేవున్ని నమ్ముకున్న “అన్యులైన విశ్వాసులుగా” కొనసాగాలి. వారు దేవుని ప్రజలమధ్య నివసింపవచ్చు. దేవుని ప్రజలతో కలిసి మోషేధర్మశాస్త్రాన్ని పాటించి, దేవుని ప్రజలతో కలిసి దేవుని దీవెనలలో వారు పాలుపొందవచ్చు. అంతేకాక, ఇశ్రాయేలీయులను/యూదులను వివాహముకూడా చేసుకోవచ్చు. అలాంటిసందర్భాలలో వారి సంతానము మిశ్రమసంతానముగా లెక్కించబడదు. అయినప్పటికిని వ్యక్తిగతంగా వారికిమాత్రము తనాక్ లేఖనాలు ఇశ్రాయేలీయులని/యూదులని ససేమిరా గుర్తింపు నివ్వదు. ఈ వాస్తవాన్ని గ్రహించని అనేక అమాయక యూదేతరులు తాల్ముద్-జూడాయిజములో చేరి తాము యూదులమయ్యామన్న భ్రమలో కొనసాగుతున్నారు. అలాంటివారిని వుద్దేశించి మెస్సయ్య పలికిన మాటలు కటువైన మాటలు–
“యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను;” (ప్రకటన 3:9).
అయితే, ఈనాడు రబ్బీలజూడాయిజములో తనాక్ బోధలకు వ్యతిరేకమైన అనేక బోధలు ఆచారాలు వాడుకలోకి వచ్చాయి. అవి రబ్బీల బోధలలో పుట్టిన మానవకల్పితాలు అన్నది సత్యాన్వేషకులు మరవకూడదు (యెషయా 29:13).
దాదాపుగా క్రీస్తు శకము రెండవ శతాబ్ధములో రబ్బీ అకివ మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవధర్మశాస్త్రము/Oral Torah) అనబడే మోషేధర్మశాస్త్రానికి (మోషే-తోరా) వేరుగా మరొక ధర్మశాస్త్రాన్ని (అన్యధర్మశాస్త్రాము) సిద్ధంచేసి యూదులకు అందించాడు. అదే గత 2000 సంవత్సరాలుగా యూదు మతాచారాలకు జీవనశైలికి అంతిమ తీర్పరిగా మరియు దిశనిర్ధారణకు దిక్సూచిగా కొనసాగుతున్నది. మోషేధర్మశాస్త్రాన్ని పక్కకుబెట్టి దానిస్థానములో వేరొక ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టడముద్వారా జూడాయిజపు మతస్తులను ప్రక్కదోవ పట్టించిన అన్యజాతీయుడైన రబ్బీ అకివను తప్పుబట్టేదిపోయి ఈనాటి జూడాయిజం వారు మోషేఅంతటివాడు అంటు రబ్బీ అకివకు కితాబునిచ్చి అందలమెక్కించి ఆయన సహకారంతో వునికిలోకి వచ్చిన మౌఖికతోరాకు దాసోహమంటూ మానవకల్పిత మతాచారాలతో నిజదేవునికి దూరంగా కొనసాగుతున్నారు. ఈ బాపతు మతమూఢులను చూసి మెస్సయ్య అయిన యషువ (యేసు క్రీస్తు) “మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు” (మార్కు 7:13) అంటూ మందలించడం జరిగింది.
బైబిల్-జుడాయిజముకు ప్రతికూలంగా అవతరించి కొనసాగుతున్న రబ్బీలజుడాయిజం లేక తాల్ముద్-జూడాయిజమే అంత్యకాల జూడాయిజం! ఈరకమైన జుడాయిజమును అనుసరిస్తున్నవారిలో అనేకమంది దేవుని లేఖనాలను అలాగే దేవుడే అభిషేకించి పంపించిన యషువ హ-మషియాఖ్ (యేసు క్రీస్తు) ను తిరస్కరించడమేగాక ఆయనను దుర్భాషలాడుతూ మొదటిశతాబ్ధములో ఆయనను సిలువకప్పగించిన యూదామతపెద్దల స్థాయిలో ఆయనను ద్వేశిస్తూ దూశిస్తూ తాము అపవాదిసంతానమన్న వాస్తవాన్ని నిరూపించుకుంటూ దైవదుషణకు మరియు సత్యతిరస్కారానికి పాల్పడుతున్నారు. వీరి కుయుక్తులకు కుతర్కాలకు అనేకమంది నామకార్థ క్రైస్తవులు యిదివరకే మోసపోయి వారి అడుగుజాడలలో క్రొత్తనిబంధన తిరస్కరిస్తూ, యేసు ప్రభువును ద్వేశిస్తూ తద్వారా దైవదూషణకు పాల్పడుతూ సాతాను సంబంధులుగా నాశనపుత్రులుగా జీవిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు విశ్వాసులు సహితం విశ్వాసబ్రష్టులయ్యే అవకాశముందంటూ లేఖనాలు ఘోషిస్తున్నాయి,
“అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1తిమోతి.4:1-2)